Fine on Bank of Maharastra | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం)పై ఆర్బీఐ రూ.1.12 కోట్ల పెనాల్టీ విధించింది. నియంత్రణ నిబంధనలను పాటించనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ నెల 18న ప్రకటించింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ)తోపాటు పలు నిబంధనలను బ్యాంక్ మహారాష్ట్ర పాటించలేదని ఆర్బీఐ తనిఖీలో తేలింది. తమకు సమర్పించిన డేటాలోనూ సమగ్రత పాటించలేదని ఆర్బీఐ తెలిపింది.
మరో రెండు బ్యాంకులపైన కూడా ఆర్బీఐ పెనాల్టీ విధించింది. హర్యానా స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్, రాజ్కోట్ నాగరిక్ సహకారి బ్యాంకులపైనా రూ.37 లక్షల జరిమాన విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
హౌసింగ్ ఫైనాన్స్ విషయంలో ఆర్బీఐ మార్గదర్శకాలను అమలు చేయడంలో హర్యానా స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ విఫలమైంది. అందుకు ఆ బ్యాంకుపై రూ.25 లక్షల జరిమాన విధించింది. డిపాజిట్లపై వడ్డీరేట్ల విషయమై నిబంధనలు అమలు చేయనందుకు రాజ్కోట్ నాగరిక్ సహకారి బ్యాంకుపై రూ.12 లక్షల పైన్ వేసింది.