ముంబై : నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మునీష్ కపూర్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియమించింది. అక్టోబర్ 3 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదోన్నతికి ముందు కపూర్ ఆర్బీఐ మానేటరీ పాలసీ విభాగం అడ్వైజర్ ఇన్చార్జిగా వ్యవహరించారు.
ఆర్బీఐలో మూడు దశాబ్ధాల ప్రస్ధానంలో కపూర్ స్ధూలఆర్ధిక విధానం, రీసెర్చి, ద్రవ్య విధానం వంటి పలు విభాగాల్లో పనిచేశారు. 2012-15లో ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు మునీష్ కపూర్ అడ్వైజర్గా వ్యవహరించారు.
ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కపూర్ ఆర్ధిక, విధాన పరిశోధన విభాగాన్ని పర్యవేక్షిస్తారు. కపూర్ ఎకనమిక్స్లో మాస్టర్స్ డిగ్రీని కలిగిఉండటంతో పాటు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ సర్టిఫైడ్ అసోసియేట్గా కొనసాగుతున్నారు.