Paytm | ప్రతి కంపెనీ దేశీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పని చేయాల్సిందేనని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. నిబంధనలకు కట్టుబడి పని చేయకుంటే ఎదురయ్యే పర్యవసనాలు ఎలా ఉంటాయో తెలిపేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ నిషేధమే తాజా ఉదాహరణ అని చెప్పారు. ఆర్బీఐ విధించిన ఆంక్షల తర్వాత రెగ్యులేటరీ నిబంధనల ప్రాధాన్యం ఫిన్ టెక్ సంస్థలకు అర్థమైందని అన్నారు. రెగ్యులేటరీ నిబంధనల నుంచి ఏ కంపెనీ తప్పించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ మీద ఆంక్షల వల్ల ఫిన్ టెక్ రంగంపై ప్రభావం చూపుతుందన్న భావన సరి కాదన్నారు.