హైదరాబాద్, జూలై 2: రత్నదీప్ రిటైల్..ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో)కి సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. దీని ప్రకారం రూ.400 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ప్రమోటైర్లెన సందీప్ అగర్వాల్, మనీష్ భర్తియా, మితేష్ భర్తియా, యష్ అగర్వాల్, కవిత అగర్వాల్లకు చెందిన 1,48,60,000 షేర్లను విక్రయించనున్నది.
ఈ వాటా విక్రయం ద్వారా సేకరించనున్న నిధుల్లో రూ.40 కోట్లను రుణాలను తీర్చడానికి, మరో రూ.260 కోట్లను రత్నదీప్, నేషనల్ మార్ట్ రిటైల్ స్టోర్లను కొత్తగా ఏర్పాటు చేయడానికి, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం సంస్థకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో 190 రిటైల్ స్టోర్లు ఉన్నాయి.