Byju’s | ఎడ్యూకేషన్ కంపెనీ బైజూస్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాజీ చైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ మోహన్ దాస్ పాయ్ గుడ్బై చెప్పారు. బైజూస్ మాతృసంస్థ థింక్ అండ్ లెర్న్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ బైజూస్తో చర్చల అనంతరం ఇద్దరు కంపెనీ సలహా మండలి సభ్యులుగా వైదొలగాలని నిర్ణయించారు. ముందుగా నిర్ణయించిన విధంగా ఏడాది సమయం పూర్తయినందున నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బైజూస్ కంపెనీకి తమ సలహాలు, సూచనలు కావాల్సి వస్తే ఇచ్చేందుకు సిద్ధమేనన్నారు. బైజూ వ్యవస్థాపకుడు రవీంద్రన్ బైజు.. కంపెనీ పునరుద్ధరణలో జాప్యానికి విదేశీ పెట్టుబడిదారులపై మండిపడ్డారు.
200 మిలియన్ల షేర్లను విక్రయించేందకు నిరాకరించిన కారణంగా కంపెనీ పునర్నిర్మాణ సమస్యలు, ఆర్థిక ఫలితాలు ఆలస్యమయ్యాయి. లిక్విడిటీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. థింక్ అండ్ లెర్న్ జూలై2023లో సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి, పాలనను మెరుగుపరచాలనే దానిపై సలహాలు స్వీకరించేందుకు అడ్వైజరీ మండలిని ఏర్పాటు చేసింది. రజనీశ్ కుమార్, మోహన్ దాస్ పాయ్ ఒక సంయుక్త ప్రకటనలో సలహాదారులు సంవత్సరం పాటు స్థిర కాల ప్రాతిపదికన ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఒప్పందం గడువు జూన్ 30, 2024న ముగియనున్నది. గత ఏడాది కాలంలో రజనీశ్ కుమార్, మోహన్ దాస్ పాయ్ అమూల్యమైన సహాయాన్ని అందించారని కంపెనీ పేర్కొంది.