న్యూఢిల్లీ, జూన్ 29 : కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ నియామకానికి బ్యాంక్ బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జూన్ 30, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా నాలుగేండ్లపాటు సేవలు అందించనున్నారు.
ఈ నియామకానికి ఆర్బీఐ అనుమతించాల్సివుంటుందని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఆయన గతంలో 25వ ఎలక్షన్ కమిషన్గా కూడా విధులు నిర్వహించారు. 2017-2020 మధ్యకాలంలో కుమార్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఆర్థిక శాఖలో పనిచేసిన సమయంలో 3.38 లక్షల బోగస్ కంపెనీలను గుర్తించి బ్లాక్ చేశారు.