Railways Electrification | పూర్తిగా భారతీయ రైల్వేల విద్యుద్ధీకరణకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. 2023 డిసెంబర్ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా రైల్వే లైన్లు పూర్తిగా విద్యుద్ధీకరించాలని లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆర్థిక సర్వే 2021-22ని పార్లమెంట్కు సమర్పించారు.
అలాగే భారతీయ రైల్వే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్కతా కారిడార్లలో గంటకు 160 కేఎంపీహెచ్ స్థాయిలో విద్యుద్ధీకరణ అప్గ్రేడ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నదని ఆర్థిక సర్వే తెలిపింది.భారతీయ రైల్వేల్లో పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2009-14 మధ్య ప్రతియేటా సగటున రూ.45,980 కోట్లు ఖర్చు చేస్తే 2021-22లోనే రూ.2.15,058 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
2009-14 మధ్య ఏటా 720 కి.మీ ట్రాక్ రైల్వేల్లో జత కలిస్తే, 2014-21 మధ్య సగటున 1835 కిలోమీటర్లు కలిశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త లైన్ల నిర్మాణంతోపాటు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు చేపట్టడం వల్లే ఇది సాధ్యమైందని ఆర్థిక సర్వే పేర్కొంది.