IRCTC | రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) హెచ్చరికలు జారీ చేసింది. అనధికారికంగా ఫుడ్ డెలివరీ చేసే యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ప్రయాణికుల కోసం ఫుడ్ సరఫరా కోసం ఇండియన్ రైల్వేస్ తెచ్చిన ప్లాట్ ఫామ్స్ వివరాలను వెల్లడించింది. అనధికారికంగా ఫుడ్ డెలివరీ చేస్తున్న వెబ్ సైట్ల జాబితాను భారతీయ రైల్వేస్ తన అఫిషియల్ ఈ-క్యాటరింగ్ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ ఖాతాలో షేర్ చేసుకున్నది.
రైల్ రెస్ట్రో, ట్రావెల్ఖానా, రైలు మిత్ర, రైల్మీల్, దిబ్రెయిల్, ఖానా ఆన్లైన్, ట్రైన్స్ కేఫ్, ఫుడ్ ఆన్ ట్రాక్, ఈ- క్యాటరింగ్, ట్రైన్ మెను వంటి వెబ్ సైట్ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయొద్దని ప్రయాణికులకు ఐఆర్సీటీసీ హితవు చెప్పింది.
రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఐఆర్సీటీ ‘ఈ-క్యాటరింగ్’ వెబ్సైట్లోకి వెళ్లి.. రైలు/ స్టేషన్ వివరాలు నమోదు చేసి.. తదుపరి పీఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేసి.. మీకిష్టమైన ఫుడ్ ఎంచుకోవచ్చు. అలాగే ఆన్ లైన్ లో గానీ, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా గానీ పేమెంట్ చేయొచ్చు. ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. అదీ కుదరకుంటే 1323 నంబర్కు కాల్చేసి 91-8750001323 వాట్సాప్ నంబర్ ద్వారా గానీ ఆర్డర్ చేయవచ్చునని వెల్లడించింది.