న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మరోసారి వడ్డీరేట్లను పెంచింది. గురువారం నుంచి అమలులోకి వచ్చేలా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని అర శాతం వడ్డించింది. దీంతో రుణ గ్రహితలు తమ నెలవారి చెల్లింపులు మరింత అధికమవనున్నాయి. దేశంలో అత్యధిక మంది తీసుకునే వాహన, వ్యక్తిగత రుణాల్లో ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 7.65 శాతం నుంచి 7.70 శాతానికి పెంచేసింది. అలాగే మూడేండ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతానికి, ఒక్క, మూడు, ఆరు నెలల రుణాలపై వడ్డీని 7.10 శాతం నుంచి 7.40 శాతం మధ్యలోకి సవరించింది. ఈ నెల మొదట్లో రెపో ఆధారిత రుణాలపై వడ్డీని అర శాతం పెంచడంతో రుణ రేటు 7.90 శాతానికి చేరుకున్నది.