న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గత పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను రిజర్వ్బ్యాంక్ యథాతథంగా ఉంచినప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రం ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రుణ గ్రహీతలకు ఆర్థికంగా లాభం చేకూరనున్నది. తగ్గించిన వడ్డీరేట్లు శనివారం నుంచి అమ ల్లోకి రానున్నాయి. దీంతో ఎంసీఎల్ఆర్ రేటు 8.25 శాతం నుంచి 8.55 శాతం మధ్యలోకి దిగిరానున్నాయి.
అంతకుముందు ఇది 8.25 శాతం నుంచి 8.60 శాతంగా ఉన్నాయి. మూడేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై మాత్రమే ఎంసీఎల్ఆర్ను తగ్గించింది. మిగతా రుణాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే నెల కాలపరిమితి రుణాలపై వడ్డీరేటును 8.25 శాతంగాను, మూడు నెలల 8.30 శాతంగాన, ఆరు-ఏడాది రుణాలపై వడ్డీరేటును 8.40 శాతంగా ఉంచింది.