ముంబై, జూన్ 15: మెర్సిడెస్ బెంజ్.. దేశీయ మార్కెట్కు మరో మాడల్ను తీసుకొచ్చింది. నూతన ప్లగ్-హైబ్రిడ్ ఎస్-క్లాస్ను మార్కెట్లోకి విడుదల చేసింది. లీటర్ పెట్రోల్కు 32.3 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ కారు ధరను రూ.2.20 కోట్లుగా నిర్ణయించింది. తన ప్లాగ్షిప్ సెడాన్ మాడల్ను అప్గ్రేడ్ చేసి మళ్లీ విడుదల చేసినట్టు బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. 3.0 లీటర్, 6-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్తోపాటు 22 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో ఈ కారును తీర్చిదిద్దింది. 22 కిలోవాట్ల బ్యాటరీ పూర్తి రీచార్జితో 115 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం 5.7 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది.