హైదరాబాద్, జూన్ 8: ప్రీమియం స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ యెజ్డీ మరో రెండు మోటర్సైకిళ్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. స్క్రాంబ్లర్ 350 పేరుతో విడుదల చేసిన ఈ బైకు రూ.1,99,950 ధరను నిర్ణయించగా, అలాగే స్క్రాంబ్లర్ 650ని ధరను రూ.3,24,950గా నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ బైకులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ నయా మాడళ్లను తీసుకొచ్చినట్టు క్లాసిక్ లెజెండ్స్ కో-ఫౌండర్ అనుపమ్ థారేజా తెలిపారు. ఈ బైకులపై నాలుగేండ్లు లేదా 50 వేల కిలోమీటర్ల వ్యారెంటీ, ఈ వ్యారెంటీని ఆరేండ్ల వరకు పెంచుకునే వీలుంటుందన్నారు.