న్యూఢిల్లీ: గ్రామీణుల కోసం పోస్టాఫీసు అద్భుతమైన బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎండోమెంట్ పాలసీగా గ్రామ్ సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ బీమా పాలసీలో రెండు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. యూజర్లు తమకు వెసులుబాటు కల స్కీమ్లో చేరొచ్చు.
ఈ పాలసీ కింద మీరు ప్రతి రోజూ రూ.95 మదుపు చేశారనుకోండి. మెచ్యూరిటీ టైం పూర్తయిన తర్వాత రూ.14 లక్షలు పొందొచ్చు. తపాలాశాఖ 1995లో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రారంభించింది. ఈ పథకం కింద ఆరు విభిన్న బీమా పాలసీలున్నాయి. వాటిలో ఒకటి గ్రామ్ సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్.
ఒక నిర్దిష్ట టైం నుంచి మరో నిర్ధిష్ట టైం వరకు డబ్బు అవసరమైన వారికి ఎంతో ప్రయోజనకారి ఈ గ్రామ్ సుమంగళ్ బీమా పథకం. ఈ బీమా పాలసీ కింద రూ.10 లక్షలు అందుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత బతికి ఉన్న పాలసీ దారుకు మనీబ్యాక్ బెనిఫిట్ లభ్యం అవుతుంది. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే, నామినీకి అష్యూర్డ్ (మెచ్యూరిటీ) మొత్తంతోపాటు బోనస్ కూడా అందుతుంది.
సుమంగళ్ స్కీమ్లో రెండు ఆప్షన్లు ఉన్నాయి.. ఒకటి 15 ఏండ్ల గడువు, మరొకటి 20 ఏండ్ల గడువు గల పాలసీ ఉన్నాయి. వీటిలో బీమా పాలసీదారుడు తనకు వెసులుబాటు గల స్కీమ్ ఎంచుకోవచ్చు.
కనిష్ఠంగా 19 ఏండ్లు దాటిన వారు మాత్రమే ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు. గరిష్ఠంగా 45 ఏండ్ల వయస్సు గల వ్యక్తి 15 ఏండ్లు, 40 సంవత్సరాల వయస్సు గల వారు 20 ఏండ్ల ఆప్షన్ ఎంచుకోవచ్చు.
15 ఏండ్ల పాలసీ తీసుకున్న వారికి ఆరేండ్ల గడువు ముగిసిన తర్వాత.. మెచ్యూరిటీ మొత్తంలో 20 శాతం, తిరిగి తొమ్మిదేండ్లు, 12 ఏండ్లు దాటిన తర్వాత మరో 20 శాతం చొప్పున మనీ బ్యాక్ అవుతుంది. మెచ్యూరిటీ టైం ముగిసిన తర్వాత మిగతా 40 శాతంతోపాటు బోనస్ కూడా చెల్లిస్తారు.
అలాగే 20 ఏండ్ల పాలసీ తీసుకున్న వారికి ఎనిమిదేండ్ల తర్వాత.. తిరిగి 12, 16 ఏండ్లు దాటాకా 20 శాతం చొప్పున మూడు దఫాలు మనీ బ్యాక్ అవుతుంది. మిగతా 40 శాతంతోపాటు బోనస్ కలిపి మెచ్యూరిటీ టైం ముగిసిన తర్వాత చెల్లిస్తారు.
25 ఏండ్ల వయస్సు గల యువకుడు 20 ఏండ్ల వ్యవధితో ఈ పాలసీ తీసుకున్నాడనుకుంటే అతడికి రూ.7 లక్షల అష్యూర్డ్ మనీ లభిస్తుంది. రోజువారీ ప్రీమియంగా రూ.95 చొప్పున నెలకు రూ.2,853 ప్రీమియం చెల్లించాలి. త్రైమాసికంలో రూ.8,449, అర్ధ సంవత్సరంలో రూ.26,715, వార్షిక ప్రీమియం రూ.32,735గా నిర్ణయించారు.
20 ఏండ్ల పాలసీ తీసుకున్న వారికి ఎనిమిదేండ్లు, 12, 16 ఏండ్లు పూర్తయిన తర్వాత రూ.1.4 లక్షల చొప్పున మనీ బ్యాక్ అవుతుంది. 20వ ఏడాది పూర్తయి, మెచ్యూరిటీ వచ్చాక మిగతా రూ.2.8 లక్షలు చెల్లిస్తారు. ప్రతి వెయ్యి రూపాయలకు ఏడాదికి రూ.48 బోనస్ యాడ్ అవుతుంది.
రూ.7 లక్షల అష్యూర్డ్ మొత్తంపై బోనస్ ఏడాదికి రూ.33,600.. మొత్తం 20 ఏండ్ల పాలసీకి బోనస్ రూపేణా రూ.6.72 లక్షలు వస్తుంది. 20 సంవత్సరాల్లో పాలసీదారుకు రూ.13.72 లక్షల మేరకు లబ్ధి చేకూరుతుంది.
ఈ రూ.13.72 లక్షల్లో మనీ బ్యాక్ రూపంలో రూ.4.2 లక్షలు వచ్చేస్తుంది. మిగతా రూ.9.52 లక్షలు మెచ్యూరిటీ టైం పూర్తయిన తర్వాత పాలసీదారుకు లభిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్పై అవగాన..!
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
‘పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?