న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్ధ పోర్షే భారత్ మార్కెట్లో శుక్రవారం ఆల్ ఎలక్ట్రిక్ పోర్షే టేకన్ను లాంఛ్ చేసింది. పోర్షే టేకన్ ఈవీ డెలివరీలు వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి. టేకన్ 560కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో అందుబాటులో ఉంటూ సింగిల్ చార్జింగ్తో 500 కిలోమీటర్లు ప్రయాణించే వెసులుబాటు కలిగిఉంది. ఈ వాహనం వీఐటీ టెక్నాలజీ ఇంజన్తో రూపొందింది.
టేకన్, టేకన్ 4ఎస్, టర్బో, టర్బో ఎస్ అనే నాలుగు మోడల్స్లో ఇది లభ్యమవుతుంది. పోర్షే టేకన్ ఈవీ రూ 1.5 కోట్ల నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఇక భారత్లో న్యూ మకన్ వాహనాన్ని కూడా పోర్షే లాంఛ్ చేసింది. జనవరి 2022 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉండే మకన్ ధర రూ 83 లక్షలని కంపెనీ వెల్లడించింది.