హైదరాబాద్, ఏప్రిల్ 20 : ప్రముఖ కిచెన్వేర్ బ్రాండ్ ప్రెస్టీజ్.. మరోమారు ఎక్సేంజ్ ఆఫర్ను తీసుకొచ్చింది. ‘ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్’ పేరిట ఈ ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఆయా ఉత్పత్తులపై ఉన్న ఎమ్మార్పీ ధరల్లో 24-66 శాతం వరకు తగ్గింపును ఇచ్చింది. కస్టమర్లు తమ వంట గదిలోని పాత ఉపకరణాలను తక్కువ ధరలకే కొత్త వాటితో మార్చుకోవచ్చు. ఈ అవకాశం జూన్ 30దాకా ఉంటుంది. కడాయి, తవా, ఫ్రైయింగ్ పాన్, మిక్సర్ గ్రైండర్లు, ప్రెషర్ కుక్కర్లు, ఇండక్షన్ కుక్టాప్, గ్యాస్ స్టౌవ్లు, రోటీ మేకర్లు, రైస్ కుక్కర్, మైక్రోవేవ్ అవెన్స్, చిమ్నీలు తదితర ఉత్పత్తులను మార్కెట్లో ప్రెస్టీజ్ విక్రయిస్తున్నది.