Poco X5 5G | చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ పొకో తన పొకో ఎక్స్5 5జీ మోడల్ ఫోన్ను భారత మార్కెట్లో ఆవిష్కరించేందుకు మూహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 14 మధ్యాహ్నం 12 గంటలకు భారత్లో ఆవిష్కరిస్తామని పేర్కొంది. మూడు విభిన్న రంగుల ఆప్షన్లలో న్యూ పొకో ఎక్స్-సిరీస్ ఫోన్ కస్టమర్ల దరి చేరనున్నది. బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంటుందని పొకో తెలిపింది. పొకో ఎక్స్5 5జీ ఫోన్ను గ్లోబల్ మార్కెట్లో గత నెలలో ఆవిష్కరించింది. ఆవిష్కరణ వేడుకను యూ-ట్యూబ్లో లైవ్ ప్రసారం చేస్తారు.
స్నాప్డ్రాగన్ 695 ఎస్వోసీ, ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లు, 6.67-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తున్నది. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫెసిలిటీ పొకో ఎక్స్5 5జీలో లభిస్తాయి. ఫ్లిప్కార్ట్ ద్వారా దేశీయ మార్కెట్లో విక్రయించనున్నట్లు తెలిపింది.
గ్లోబల్ మార్కెట్లో 289 డాలర్లు (దాదాపు రూ.24,700) పలికిన పొకో ఎక్స్5 5జీ ఫోన్.. 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్నది. బ్లాక్, బ్లూ, గ్రీన్ షేడ్స్ కలర్స్లో వస్తున్న ఈ ఫోన్ రూ.20 వేలకు భారత మార్కెట్లో లభ్యం కావచ్చునని తెలుస్తున్నది.