Poco -Airtel | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ పొకో ఇండియా.. భారత్ యూజర్ల కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నది. తక్కువ ధరకే భారతీయులకు స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది. ఇందుకోసం ప్రముఖ టెలికం సంస్థ ‘భారతీ ఎయిర్టెల్’ జత కట్టింది. గత ఏప్రిల్ నెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన పొకో.. ఎయిర్ టెల్ భాగస్వామ్యంతో రూ.5,999లకే అందుబాటులోకి తెస్తున్నది. ఈ నెల 18 నుంచి ప్లిప్కార్ట్లో సేల్స్ ప్రారంభం అవుతాయి.
ఎయిర్ టెల్ భాగస్వామ్యంతో పొకో సీ51 ఫోన్ కొనుగోలు చేసిన వారందరికీ ఎయిర్ టెల్ నుంచి వన్ టైం 50 జీబీ మొబైల్ డేటా లభిస్తుంది. నాన్-ఎయిర్ టెల్ కస్టమర్లకు డోర్ స్టెప్ సిమ్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంటే ఇన్ స్టంట్ డెలివరీ లభిస్తుంది.
పొకో సీ51 ఫోన్ అసలు ధర రూ.6999. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్గా అందుబాటులోకి వస్తున్న ఈ ఫోన్ 6.52-అంగుళాల హెచ్ డీ + డిస్ ప్లే కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ తో వస్తున్నది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో-క్లీన్ యూఐ వర్షన్ తో పని చేస్తుంది. రెండేండ్ల పాటు యూజర్లకు సెక్యూరిటీ అప్ డేట్స్ లభిస్తాయి.