న్యూఢిల్లీ : పోకో ఎం4 ప్రొ 5జీ నవంబర్ 9న గ్లోబల్ మార్కెట్లో లాంఛ్ కానుంది. గతవారం ఈ స్మార్ట్ఫోన్ లాంఛ్పై కంపెనీ ప్రకటన చేసిన అనంతరం కీలక స్సెసిఫికేషన్స్ ఇవేనంటూ ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్ ఇటీవల లాంఛ్ అయిన రెడ్మి నో్ట్11 రీబ్రాండెడ్ వేరియంట్గా ముందుకొస్తుందని చెబుతున్నారు. షియోమి, పోకో కంపెనీలు విభిన్న మార్కెట్లలో తమ రీబ్రాండింగ్ పోన్లను ప్రవేశపెట్టే ఆనవాయితీని కలిగిఉన్న సంగతి తెలిసిందే.
గత ఏడాది సైతం పోకో రెడ్మి నోట్ 10 5జీని భారత్లో పోకో ఎం3 ప్రొ 5జీ పేరుతో రీబ్రాండెడ్ వెర్షన్గా లాంఛ్ చేసింది. ఇక పోకో ఎం4 ప్రొ 5జీ గ్రే, యల్లో కలర్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంటుంది. 33వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సామర్ధ్యంతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8 మెగాపిక్సెల్ సెకడంరీ సెన్సర్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.