న్యూఢిల్లీ, మార్చి 5: ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రోజువారీ ఏటీఎం నగదు విత్డ్రా పరిమితిలో 50 శాతం మేర కోత విధించింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నూతన నిబంధనలతో ఏటీఎం ద్వారా రూ.75 వేల వరకు విత్డ్రా చేసుకోవచ్చును.
ఖాతాదారుల భద్రత, రిస్క్ను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది.