రూ.10 లక్షలు, ఆపై చెక్కుల చెల్లుబాటుకు తప్పనిసరి
ఏప్రిల్ 4 నుంచి కొత్త నిబంధనలు: పీఎన్బీ
న్యూఢిల్లీ, మార్చి 1: రూ.10 లక్షలు, ఆపై విలువ కలిగిన చెక్కుల క్లియరెన్స్కు వాటిని జారీ చేసినవారి అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మంగళవారం తెలియజేసింది. ఏప్రిల్ 4 నుంచి పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్) కింద హై-వాల్యూ చెక్కులను కస్టమర్ నిర్ధారించిన తర్వాతే చెల్లుబాటుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. చెక్కు మోసాల నుంచి బ్యాంక్ ఖాతాదారులను రక్షించడానికే వచ్చే నెల 4 నుంచి పీపీఎస్ను తప్పనిసరి చేస్తున్నట్టు పేర్కొన్నది. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం గతేడాది జనవరి నుంచి సీటీఎస్ క్లియరింగ్లో రూ.50వేలు, ఆపై విలువైన చెక్కుల కోసం పీపీఎస్ను ఇప్పటికే పీఎన్బీ అమల్లోకి తెచ్చింది. పీపీఎస్ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసింది.