న్యూఢిల్లీ, మే 7: రిజర్వ్బ్యాంక్ రెపో రేటును పెంచిన నేపథ్యంలో శనివారం ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎఫ్డీలపై మరింత వడ్డీ ఇస్తున్నట్టు ప్రకటించింది. కొన్ని కాలపరిమితుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 60 బేసిస్ పాయింట్ల వరకూ పీఎన్బీ పెంచింది.
రేట్ల పెంపు మే 7 నుంచి వర్తిస్తుందని తెలిపింది. రూ.2 కోట్ల లోపు దేశీ టెర్మ్ డిపాజిట్లపై రేట్లను 10-20 బేసిస్ పాయింట్లు పెంచగా, రూ. 2 నుంచి రూ. 10 కోట్ల డిపాజిట్లపై ఆయా కాలపరిమితుల్నిబట్టి 60 బేసిస్ పాయింట్ల (0.6 శాతం) వరకూ అధికంగా వడ్డీ ఆఫర్ చేస్తున్నట్టు పీఎన్బీ తెలిపింది.
30 రోజుల నుంచి 45 కాలపరిమితులుగల ఎఫ్డీలపై 60 బేసిస్ పాయింట్లు, 271 రోజుల నుంచి 1 ఏడాది పరిమితిగల ఎఫ్డీలపై 50 బేసిస్ పాయింట్లు పెంచింది. మిగిలిన కాలపరిమితులు గల అన్ని డిపాజిట్ల రేట్లలో మార్పులేదని పీఎన్బీ తెలిపింది. ఇక రెపో లింక్డ్ లెండింగ్ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్) 6.90 శాతానికి పీఎన్బీ పెంచింది. ఈ బ్యాంక్ వెబ్సైట్లో పొందుపర్చిన సమాచారం ప్రకారం సవరించిన ఆర్ఎల్ఎల్ఆర్ కొత్త కస్టమర్లకు తక్షణమే అమలులోకి రాగా, ప్రస్తుత ఖాతాదారులకు జూన్ 1 నుంచి వర్తిస్తుంది.