సంగారెడ్డి, ఏప్రిల్ 5: మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి ముందున్న కర్తవ్యమని, బాబూ జగ్జీవన్రామ్ స్ఫూర్తితో నడుచుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం బాబూ జగ్జీవన్రామ్ 114వ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్రెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ లోకేశ్వర్రెడ్డి, జిల్లా అధికారులు, ప్రముఖులు, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీ నివాళులర్పించగా, వారివెంట మాజీ సీడీసీ అధ్యక్షుడు శంకరీ విజయేందర్రెడ్డి, బీరయ్యయాదవ్, ఎంపీటీసీ నందకిషోర్, జలేందర్రావు, హుస్సేన్ తదితరులున్నారు. సంగారెడ్డి పట్టణంలోని అస్తబల్లో జగ్జీవన్రామ్ చిత్రపటానికి కొత్తపల్లి శ్రీకాంత్(నానీ) పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్లో…
డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ 114వ జయంతిని పురస్కరించుకుని జిల్లా పరిషత్లో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, వేణుగోపాల్, రవీందర్, విజ్ఞాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
హైదరాబాద్లో ఇండ్లకు భలే గిరాకీ
దళితుల సంక్షేమానికి బాబూ జగ్జీవన్రామ్ కృషి
మధ్యాహ్నం మండుటెండ సాయంత్రం జోరువాన