జనవరి-మార్చిలో 81 శాతం పెరిగిన అమ్మకాలు.. నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: హైదరాబాద్లో ఇండ్లకు భారీగా డిమాండ్ కనిపిస్తున్నది. గతంతో పోల్చితే ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో అమ్మకాలు ఏకంగా 81 శాతం పెరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ దిగ్గజం నైట్ ఫ్రాంక్ తెలిపింది. గత మూడు నెలల్లో 6,909 యూనిట్ల విక్రయాలు జరిగాయని తాజా నివేదికలో నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. దేశంలోని పలు ప్రధాన నగరాలతో పోల్చితే ఇది ఎంతో ఎక్కువ కావడం గమనార్హం. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం నుంచి భాగ్యనగర రియల్టీ పూర్తిగా కోలుకుందనడానికి ఇదే గొప్ప నిదర్శనం. హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల రియల్టీపై నైట్ ఫ్రాంక్ సర్వే చేసింది. గతే
డాది జనవరి-మార్చితో పోల్చితే ఈసారి రెసిడెన్షియల్ ప్రాపర్టీల అమ్మకాలు 44% పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. మొత్తం 71,963 యూనిట్లు సేల్ అయ్యాయి. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం.. ముంబై, పుణెల్లో అమ్మకాలను గణనీయంగా పెంచింది. ఈ క్రమంలోనే నిరుడుతో పోల్చితే ముంబైలో 49%, పుణెలో 75% వృద్ధి కనిపించింది. ముంబైలో 23,752, పుణెలో 13,653 యూనిట్లు అమ్ముడయ్యాయి. బెంగళూరులో 18 శాతం, చెన్నైలో 36 శాతం, ఢిల్లీలో 24 శాతం, కోల్కతాలో 22 శాతం, అహ్మదాబాద్లో 34 శాతం అమ్మకాలు పెరిగాయి.
మరిన్ని వార్తలు చదవండి..
మొబైల్ వ్యాపారానికి ఎల్జీ గుడ్బై