న్యూఢిల్లీ : పిక్సెల్ వాచ్ ఇంతకుముందు దేశీ మార్కెట్లో అడుగుపెట్టని క్రమంలో పిక్సెల్ వాచ్ 2 ఇండియాలోనూ లాంఛ్ అవుతుందని వెల్లడైంది. ఈ హాట్ డివైజ్ దేశీ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వడం టెక్ ప్రియులను థ్రిల్కు గురిచేస్తోంది. గూగుల్ పిక్సెల్ వాచ్ 2 (Pixel Watch 2) అక్టోబర్ 5న భారత్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. మేడ్ బై గూగుల్ లాంఛ్ ఈవెంట్ ద్వారా ఈ క్రేజీ వాచ్ గ్లోబల్ మార్కెట్లలో సందడి చేయనుంది. గూగుల్ పిక్సెల్ వాచ్ 2 ఫ్లిప్కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
పిక్సెల్ 8 సిరీస్తో పాటు పిక్సెల్ బడ్స్ ప్రొ కూడా అదే వేదికగా లాంఛ్ కానున్నాయి. పిక్సెల్ వాచ్ను పోలిన డిజైన్తోనే పిక్సెల్ వాచ్ 2 స్టైలిష్ పోర్స్లెయిన్ కలర్ బ్యాండ్తో ఆకట్టుకోనుంది. పిక్సెల్ వాచ్ గతంలో భారత్లో లభించకపోవడంతో పిక్సెల్ వాచ్ 2 దేశీ మార్కెట్లో లాంఛ్ కానుండటం టెక్ ఔత్సాహికులు ఉత్సుకత చూపుతున్నారు.
పిక్సెల్ వాచ్ 2 స్పెసిఫికేషన్స్ గురించి వెల్లడైన లీకుల ప్రకారం క్వాల్కాం స్నాప్డ్రాగన్ డబ్ల్యూ 5 సిరీస్ చిప్సెట్, వియర్ ఓఎస్ 4, గూగుల్ వేరబుల్ ఆపరేటింగ్ సిస్టమ్, స్టైలిష్, డ్యూరబులిటీతో అల్యూమినియం బాడీ వంటి ఫీచర్లతో పిక్సెల్ వాచ్ 2 కస్టమర్ల ముందుకు రానుంది.
Read More :