iPhone 15 Series | ఆపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ను విడుదల చేసింది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఫోన్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఫోన్ను కొనుగోలు చేసిన యూజర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఐఫోన్ 15తో సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొబైల్ విపరీతంగా వేడెక్కుతుంది. దీంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ను వినియోగించిన సమయంలో కెమెరా సైతం హీట్ అవుతుందని పలువురు యూజర్లు పేర్కొన్నారు.
అలాగే, గేమ్స్ ఆడుతున్నప్పుడు, ఛార్జింగ్ చేస్తున్న సమయంలోనూ ఫోన్ హీట్ అవుతుందని పేర్కొంది. అయితే, నేపథ్యంలో ఐఫోన్ ఓ అప్డేట్ను విడుదల చేసింది. అయితే, అప్డేట్ అవుతున్న సమయంలో కొత్త మొబైల్ ఫ్రీజ్ అవుతుందని చాలా మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. యాపిల్ లోగో తెరపైకి కనిపించడం లేదని, పాత ఫోన్ నుంచి డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నించిన సమయంలోనూ సమస్యలను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. అయితే, అప్డేట్లో బగ్ను సరి చేసినట్లు ఆపిల్ పేర్కొంది.
మరికొందరు ఐఫోన్ 15 స్లోగా ఉందని.. ఐఓఎస్ 17 కారణంగానే ఫోన్ స్లో అయిందని, కొన్ని సమయాల్లో స్టక్ అవుతుందని మరికొందరు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈసారి ఆపిల్ టైటానియం బాడీతో ఫోన్ల తీసుకువచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే, కంపెనీ తీసుకువచ్చిన టైటానియం బాడీ సైతం యూజర్లకు ఇబ్బందికరంగా మారింది. ఫోన్ దుమ్ముబారుతుందని, ఫోన్ బాడీపైగా గీతలుపడుతున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో చాలా మంది గతంలో వచ్చిన మోడల్స్తో పోలిస్తే ఫోన్ చాలా వీక్గా ఉందని పలువురు యూట్యూబర్లు తెలిపారు.