న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకున్న ఉద్యోగులు తమ పీఎఫ్ నుంచి ఆన్లైన్లో పీఎఫ్ విత్డ్రా ( PF withdraw ) మెడికల్ అడ్వాన్స్ కింద రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకునేందుకు అర్హులు. హాస్పిటలైజేషన్ లేదా అత్యవసర వైద్య చికిత్స కోసం కార్ఫస్ నిధిగా విత్ డ్రా చేసుకోవచ్చు.
అలా ఈపీఎఫ్వో నుంచి నగదు విత్డ్రాయల్ చేయడానికి ఉద్యోగులు హాస్పిటలైజేషన్కు ఇంత ఖర్చవుతుందని పేర్కొనాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఈపీఎఫ్వో సర్క్యులర్ జారీ చేసింది. మెడికల్ ఎమర్జెన్సీ కింద మెడికల్ అడ్వాన్స్ గ్రాంట్ చేసుకునేందుకు అనుమతినిస్తూ మరోమారు ఈ సర్క్యులర్ విడుదల చేసింది.
మెడికల్ అడ్వాన్స్ తీసుకోవడానికి, వైద్య చికిత్స పొందడానికి అవసరమైన నిధులుగా ఈపీఎఫ్వో నుంచి విత్ డ్రా చేసుకోవడానికి షరతులు వర్తిస్తాయి. కోవిడ్-19 అనుబంధ వైద్య చికిత్సకు కూడా ఇది వర్తిస్తుంది.
సెంట్రల్ సర్వీసెస్ మెడికల్ అటెండెంట్ (సీఎస్ఎంఏ), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) కింద వైద్య సేవలు పొందే వారికి కూడా ఈ అడ్వాన్స్ తీసుకునేందుకు వెసులుబాటు ఉంది. ప్రాణాంతక వ్యాధుల చికిత్స కోసం అత్యవసర పరిస్థితుల్లో దవాఖానల్లో చేరే వారికి ఈ మెడికల్ అడ్వాన్స్ తీసుకునే వీలు కల్పించింది ఈపీఎఫ్వో.
అత్యవసర వైద్య చికిత్స కోసం దవాఖానలో చేరినప్పుడు ఖర్చును అంచనా వేయడం చాలా కష్టంతో కూడిన పని. రోగి కుటుంబ సభ్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో మెడికల్ అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటు ఈపీఎఫ్వో ఇచ్చింది.
రోగి తప్పనిసరిగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, సీజీహెచ్ఎస్ ప్యానెల్ దవాఖానలో చికిత్స కోసం చేరి ఉండాలి. ప్రైవేట్ దవాఖానలో చేరి ఉంటే, మెడికల్ అడ్వాన్స్కు నిబంధనలను సడలించాలని సంబంధిత సంస్థ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రైవేట్ దవాఖానకు చెల్లించిన వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్కు వీలు కల్పించాలని అభ్యర్థించాలి.
ఉద్యోగి లేదా ఉద్యోగి కుటుంబ సభ్యుడు రోగి తరఫున మెడికల్ అడ్వాన్స్ కోసం లేఖ సబ్మిట్ చేయొచ్చు. వైద్య ఖర్చు ఎంత అన్నది పేర్కొనాల్సిన పని లేదు. హాస్పిటల్, రోగి వివరాలు-ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుపాలి.
సంబంధిత రోగి చికిత్స పొందుతున్న దవాఖాన ఖాతాలో గానీ, రోగి ఖాతాలో గానీ, రోగి కుటుంబ సభ్యుడి ఖాతాలో గానీ ఆ ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ అధికారి రూ.లక్ష మెడికల్ అడ్వాన్స్ డిపాజిట్ చేయొచ్చు. వీలైతే అదే రోజు అడ్వాన్స్ చెల్లించాలి. లేదా మరుసటి రోజే చెల్లించేయాలి.
ఒకవేళ వైద్య ఖర్చు రూ.లక్ష దాటితే.. నిబంధనలకు అనుగుణంగా అదనపు అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటు ఉంటే మంజూరు చేయొచ్చు. దవాఖాన నుంచి అంచనా నివేదిక అందినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యేలోపు నగదు డిపాజిట్ చేయాలి.
ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందితే సదరు ఉద్యోగి లేదా కుటుంబ సభ్యుడు.. దవాఖాన నుంచి డిశ్చార్జి అయిన 45 రోజుల్లో వైద్య ఖర్చుల బిల్లును ఈపీఎఫ్వోకు సమర్పించాలి. ఆ తర్వాత ఈపీఎఫ్ నిబంధనలకు అనుగుణంగా.. దవాఖానా తుది బిల్లును బట్టి మెడికల్ అడ్వాన్స్ మంజూరు చేయొచ్చు.
తుది దవాఖాన వైద్యచికిత్స బిల్లును బట్టే చెల్లించిన మెడికల్ అడ్వాన్స్ రికవరీ లేదా రీయింబర్స్మెంట్ చేయొచ్చు. ప్రతి సభ్యుడి ఆరు నెలల కనీస వేతనం, డీఏ, సభ్యుడి వాటాపై వచ్చే వడ్డీని విత్డ్రా చేసుకోవచ్చు.
Chanu Saikhom Mirabai | కట్టెలు మోసిన చేతులే సిల్వర్ మెడల్ తీసుకొచ్చాయి
Tokyo Olympics: తొలి గోల్డ్ మెడల్ చైనా ఖాతాలో.. ఇండియన్ షూటర్లు ఫెయిల్
చరిత్రలో ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన బడ్జెట్ ఇది
మీరాబాయి చాను కోచ్కు రూ.10 లక్షల నగదు బహుమతి
గోల్డ్ కోసం చాలా ప్రయత్నించాను కానీ..: మీరాబాయ్ చాను
Tokyo Olympics: హాకీలో ఇండియా బోణీ.. న్యూజిలాండ్పై విజయం
Tokyo Olympics : ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్కు భారత్
బ్రహ్మాజీతో జాగ్రత్తగా ఉండు.. నాగశౌర్యకు రానా సూచన