Petromin – HPCL | మల్టీ బ్రాండ్ వెహికల్ సర్వీస్ వర్క్ షాపులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ (హెచ్పీసీఎల్) కీలక నిర్ణయం తీసుకున్నది. పెట్రోమిన్ కార్పొరేషన్ కేఎస్ఏ అనుబంధ పెట్రోమిన్ ఎక్స్ప్రెస్తో పార్టనర్ షిప్ ఒప్పందం కుదుర్చుకున్నది. రెండు సంస్థలు కలిసి వచ్చే ఐదేండ్లలో 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపాయి.
దేశవ్యాప్తంగా హెచ్పీసీఎల్ రిటైల్ పెట్రోల్ బంకుల వద్ద 1000 వెహికల్ సర్వీస్ కేంద్రాల ఏర్పాటు కోసం 100 మిలియన్ డాలర్లు, 5000 ఈవీ చార్జింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి నిర్వహించడానికి 100 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ చార్జింగ్ స్టేషన్ల వద్ద హైస్పీడ్ డీసీ చార్జర్లు, ఏసీ చార్జర్లు ఉంటాయి. మరో 500 మిలియన్ డాలర్లు కేఎస్ఏ, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడి పెడతారు. ఇటీవల జరిగిన జీ20 సదస్సు వద్ద సౌదీ అరేబియా పెట్టుబడుల శాఖతో కలిసి ఇండియా ఇన్వెస్ట్ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో పెట్రోమిన్, హెచ్పీసీఎల్ మధ్య ఒప్పందం కుదిరింది.