న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం వరుసగా మూడోరోజూ పెరగడంతో ఇంధన ధరలు రికార్డు స్థాయిలకు చేరాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు నేడు లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు, డీజిల్ ధర లీటర్కు 30 పైసల చొప్పున పెంచాయి. దీంతో పలు మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైం హైకి చేరాయి.
పెరిగిన పెట్రో ధరలతో రాజస్ధాన్లోని శ్రీగంగానగర్లో లీటర్ పెట్రోల్ అత్యధికంగా రూ 114.08కి ఎగబాకింది. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్కు రూ 102.14 పలికింది. హైదరాబాద్లో పెట్రోల్ లీటర్కు తాజా పెంపుతో రూ 106.26కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ 108.19కి పెరిగింది.