న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: దేశీయ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ మొబీక్విక్.. ఓ సరికొత్త ఫీచర్ను తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. బ్యాంక్ ఖాతాతో అనుసంధానం లేకుండానే చెల్లింపులు జరిపేలా ‘పాకెట్ యూపీఐ’ సౌకర్యాన్ని పరిచయం చేసింది. ఇకపై కస్టమర్లు తమ ఖాతాల్ని లింక్ చేసుకోకుండానే మొబీక్విక్ వ్యాలెట్ ద్వారా యూపీఐ పేమెంట్స్ను ఈ పాకెట్ యూపీఐతో చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. బ్యాంక్ ఖాతా నుంచి నిధుల బదిలీ కంటే మొబీక్విక్ వ్యాలెట్ నుంచి బదిలీయే సురక్షితమని, ఆర్థిక మోసాలకు తావుండదని ఈ సందర్భంగా మొబీక్విక్ తెలిపింది.