Axis Bank-Paytm | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)’పై తన మర్చంట్ల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నది. దీంతో పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్, కార్డు మెషిన్లతో యధాతథంగా ఆపరేషన్లు నిర్వహించవచ్చు. ఇందుకోసం యాక్సిస్ బ్యాంకులో పేటీఎం పేరెంట్ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్’.. ఎస్క్రో ఖాతాను ప్రారంభించనున్నది. దీని ప్రకారం పేటీఎం తన నోడల్ అకౌంట్ను యాక్సిస్ బ్యాంకుకు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. దీంతో పేటీఎం మర్చంట్స్ సెటిల్మెంట్లు యథాతథంగా కొనసాగుతాయి. మార్చి 15 తర్వాత కూడా మర్చంట్లందరి వద్ద పేటీఎం యాప్, పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్, కార్డ్ మెషిన్ కొనసాగుతాయి.
కేవైసీ సహా పలు రెగ్యులేటరీ నిబంధనలను అమలు చేయడంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్) విఫలమైందని బయటి ఆడిటింగ్ సంస్థలతో ఆర్బీఐ నిర్వహించిన అడిటింగ్లో తేలింది. దీంతో ఈ నెల 29 నుంచి ఖాతాదారుల నుంచి డిపాజిట్ల సేకరణ, కస్టమర్లకు క్రెడిట్ ఫెసిలిటీ, టాపప్ రుణ పరపతి కల్పన, ఫాస్టాగ్ సేవలు, తదితర సర్వీసులు నిర్వహించొద్దని పేటీఎంను ఆర్బీఐ గత నెల 31న ఆదేశించింది. కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిషేధాన్ని మార్చి 15 వరకూ సడలించింది.