Paytm-NPCI | పేటీఎం యాప్ యూజర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) బిగ్ రిలీఫ్ అందించింది. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్గా యూపీఐ లావాదేవీలు నిర్వహించేందుకు పేటీఎం ఓనర్ వన్97 కమ్యూనికేషన్స్ సంస్థకు ఎన్పీసీఐ గురువారం అనుమతి ఇచ్చింది. పేటీఎం పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ బ్యాంకులుగా యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్ ఉన్నాయి.
వన్97 కమ్యూనికేషన్స్కు యెస్ బ్యాంక్ మర్చంట్ అక్వైరింగ్ బ్యాంక్ హోదా కల్పిస్తున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది. ప్రస్తుత పేటీఎం, కొత్త పేటీఎం యూజర్లకు ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొంది. దీని ప్రకారం పేటీఎం బ్రాండ్ కింద వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ పేమెంట్ సర్వీస్ అందిస్తుంది. నిరంతరాయంగా పేటీఎం హ్యాండిల్స్ పని చేస్తాయి.
పేటీఎం యూపీఐ లావాదేవీలు, ఆటో పే కొనసాగుతాయని ఎన్పీసీఐ వెల్లడించింది. తదనుగుణంగా పేటీఎం తన పేమెంట్స్ హ్యాండిళ్లను కొత్త బ్యాంకులకు బదిలీ చేయాలని సూచించింది. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ ఆంక్షలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎన్పీసీఐ ఆదేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. మార్చి 15 లోగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కస్టమర్లు, మర్చంట్లు ఇతర బ్యాంకులకు తమ ఖాతాలను బదిలీ చేసుకోవాలని ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే.