Paytm FASTag | పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్న వారంతా కొత్త ఫాస్టాగ్ తీసుకోవాలని బుధవారం ఓ ప్రకటనలో కోరింది. టోల్ప్లాజాల వద్ద రద్దీని నివారించేందుకు, ప్రయాణం సులభతరం చేసేందుకు ఈ నెల 15లోగా ఏదైనా బ్యాంకు నుంచి కొత్తగా ఫాస్టాగ్ తీసుకోవాలని చెప్పింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రెగ్యులేటరీ నిబంధనలు ఉల్లంఘనల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్పై ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ఈ నెల 15 తర్వాత అన్ని క్రెడిట్ లావాదేవీలు, డిపాజిట్లను నిలిపివేయాలని చెప్పింది.
ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింన విషయం విధితమే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు సంబంధించిన ఆంక్షల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల మేరకు మార్చి 15 తర్వాత పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులు రీఛార్జ్ చేసేందుకు అవకాశం లేదని తెలిపింది. గడువు తర్వాత కూడా వినియోగదారులు టోల్ చెల్లించడానికి ఇప్పటికే ఉన్న బ్యాలెన్స్ను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికే అధీకృత బ్యాంకుల జాబితాను విడుదల చేసింది.
ఇందులో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్, కాస్మోస్ బ్యాంక్, డోంబివాలి నగరి సహకారి బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఫినో పేమెంట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, లిక్విక్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, నాగ్పూర్ నాగ్పూర్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పంజాబ్ మహారాష్ట్ర బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సరస్వత్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, జల్గావ్ పీపుల్స్ కో-ఆప్ బ్యాంక్, త్రిసూర్ డిస్ట్రిక్ట్ కో-ఆప్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ బ్యాంక్ ఉన్నాయి.