న్యూఢిల్లీ, మే 30: యోగా గురువు రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.263.7 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.234.43 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధిని కనబరిచింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.6,676. 19 కోట్ల నుంచి రూ.7,962.95 కోట్లకు చేరుకున్నట్లు మంగళవారం వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.31,821.45 కోట్ల ఆదాయంపై రూ.886.44 కోట్ల నికర లాభాన్ని గడించింది. రూ.6 డివిడెండ్ను ప్రకటించింది.