న్యూఢిల్లీ, నవంబర్ 9: పతంజలి ఫుడ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.254.53 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.112.28 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.8,524.67 కోట్ల నుంచి రూ. 7,845.79 కోట్లకు తగ్గినట్టు పేర్కొంది.
మరోవైపు మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని ఉత్పత్తులకు ప్రచారకర్తగా నియమించుకున్నది. నిర్వహణ ఖర్చులు రూ. 8,371 కోట్ల నుంచి రూ.7,510 కోట్లకు తగ్గాయి. సంస్థకు వచ్చిన ఆదాయంలో ఫుడ్, ఎఫ్ఎంసీజీ నుంచి రూ.2,487.62 కోట్లు సమకూరినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.