న్యూఢిల్లీ, ఏప్రిల్ 1 : వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. 2025-26లో దేశవ్యాప్తంగా 47 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకీ, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు అంచనాలకు మించి రాణించడం, జీఎస్టీ 2.0తో వాహన ధరలు తగ్గుముఖం పట్టడం కలిసొచ్చింది.
2024-25లో 43.4 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. కమోడిటీ ఉత్పత్తులు మరింత ప్రియంకావడంతో సంస్థలు ఆ తర్వాత చిన్న కార్ల ధరలను పెంచాయి.