న్యూఢిల్లీ, జనవరి 13: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. 2023లో తొలిసారిగా దేశీయంగా 40 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. యుటిలిటీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటం వల్లనే రికార్డు స్థాయికి చేరుకున్నాయని భారత్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) వెల్లడించింది. 2023లో 41,01,600 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2022లో నమోదైన 37,92,444 యూనిట్లతో పోలిస్తే 8 శాతం అధికమని పేర్కొంది.