న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు/ఉపసంహరణలు, ఆస్తులు-మోటర్ వాహనాల కొనుగోళ్లు, హోటల్/రెస్టారెంట్ బిల్లుల చెల్లింపులు, ఇతరత్రా వాటిల్లో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) వివరాలకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న నిబంధనలు మారబోతున్నాయి. తాజాగా విడుదలైన ఆదాయ పన్ను (ఐటీ) రూల్స్ ముసాయిదా 2026లో పాన్ను పేర్కొనేందుకున్న పరిమితుల్ని గణనీయంగా పెంచారు. ఈ ప్రతిపాదనలకు భాగస్వాములతో సంప్రదింపులు, అభిప్రాయాల సేకరణ తర్వాత పునఃపరిశీలించి, అవసరమైన మార్పులు చేసి మార్చి మొదటి వారానికల్లా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రూల్స్కు తుది రూపు ఇవ్వనున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు సోమవారం వెల్లడించాయి.
ఆదాయ పన్ను చట్టం 1962 స్థానంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. ఆదాయ పన్ను చట్టం 2025ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 1న మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి ఇది అమల్లోకి రానున్నది. పాత చట్టంతో పోల్చితే కొత్త చట్టంలో రూల్స్ సంఖ్యను 511 నుంచి 333కు, ఫామ్స్ను 399 నుంచి 190కి తగ్గించారు. ఇందులో భాగంగానే కొత్త ఐటీ రూల్స్ రాబోతున్నాయి. దానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఇప్పుడు విడుదలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..