న్యూఢిల్లీ, డిసెంబర్ 10: గడువు తేదీలోగా ఆధార్తో లింక్కాని పాన్ కార్డు నిరుపయోగం అవుతుందని ఆదాయపు పన్ను శాఖ తాజాగా ఒక హెచ్చరిక జారీచేసింది. ఇప్పటివరకూ ఆధార్తో పాన్ కార్డ్ లింక్ చేసుకోని పన్ను చెల్లింపుదార్లు తక్షణమే అనుసంధానించుకోవాలని సూచించింది. ఇందుకు చివరి గడువు 2023 మార్చి 31తో ముగియనుంది. వాస్తవానికి ఫైన్ లేకుండా ఆధార్తో పాన్ కార్డును లింక్ చేసుకునే గడువు ఇప్పటికే ముగిసిపోయినందున, ప్రస్తుతం అనుసంధానించేందుకు రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఫైన్తో లింక్ చేసే సదుపాయం సైతం వచ్చే మార్చి 31 తర్వాత ఉండదు. చివరితేదీ సమీపిస్తున్నందున, జాప్యం చేయవద్దని, తక్షణం లింక్ చేసుకోవాలంటూ ఐటీ శాఖ ట్వీట్ చేసింది.
ఆధార్తో లింక్ చేయని పాన్ పనిచేయదు. 2023 ఏప్రిల్ 1 నుంచి పాన్ నిరుపయోగం అయితే పాన్ తప్పనిసరి అయిన సందర్భాల్లో ఆ నంబర్ను ఉపయోగించలేరు. బ్యాంక్ ఖాతాలు, డీమ్యాట్ ఖాతాలు తెరవడం, ఆదాయపు పన్ను రిటర్న్లు వేయడం, ఖరీదైన ఉత్పత్తులను కొనడం వంటివి సాధ్యపడదు.
పెనాల్టీ చెల్లించాలంటే…