న్యూఢిల్లీ, జనవరి 25: ఆయా రంగాల్లో విశేష సేవల్ని అందించినవారికి గురువారం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికిగాను పద్మా అవార్డులను ప్రకటించింది. మొత్తం 132 మందికి ఈ గౌరవం దక్కగా.. ఇందులో వ్యాపార రంగానికి చెందినవారు నలుగురున్నారు. వీరిలో జిందాల్ గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సీతారామ్ జిందాల్కు పద్మభూషణ్ అవార్డు లభించగా, తైవాన్కు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్, సీఈవో యంగ్ లియుకు సైతం పద్మభూషణ్ వచ్చింది. అలాగే బ్యాంకర్ కల్పనా మోర్పారియాతోపాటు ఆంత్రప్రెన్యూర్ శశి సోనీలకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. వీరందరికీ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు రానున్నాయి.