న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఆతిథ్య సేవల సంస్థ ఓయో స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. ఈ వాటాల విక్రయంతో బిలియన్ డాలర్ల నుంచి 1.2 బిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించాలని సంస్థ యోచిస్తున్నది. ఇందుకు సంబంధించి సెబీకి వచ్చేవారంలో డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్హెచ్పీ)ని వచ్చేవారంలో దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ఐపీవోకి సంబంధించి ఇప్పటికే ఓయో జేపీ మోర్గాన్, సిటీ, కొటక్ మహీంద్రా క్యాపిటల్లను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులుగా నియమించుకున్నది. దీనిపై కంపెనీ ఉన్నతాధికారులు స్పందించడానికి నిరాకరించారు.