హైదరాబాద్, మార్చి 18: ప్రముఖ ఆతిథ్య సేవల సంస్థ ఓయో..హైదరాబాద్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించబోతున్నది. ఈ ఏడాదిలో మరో 150 ప్రీమియం హోటళ్ల ద్వారా సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. గచ్చిబౌలీ, హైటెక్ సిటీ, లకిడికపూల్, విమానాశ్రయ ప్రాంతాల్లో ఉన్న చిన్న స్థాయి హోటళ్లను లీజుకు తీసుకొని సేవలు అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.