న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడటం, మందగమనంతో పలు టెక్ కంపెనీలు మాస్ లేఆఫ్స్కు తెగబడుతుండగా మరికొన్ని కంపెనీలు ఖర్చులకు కళ్లెం వేస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) ఈ ఏడాది కేవలం 70 శాతం ఉద్యోగులకే వేతన పెంపు చేపట్టాలని నిర్ణయించడంతో 5000 మందికి పైగా ఉద్యోగులకు వేతన పెంపు దూరం కానుంది. గ్రేడ్ 10 ఆపై లెవెల్స్ ఉద్యోగులందరికీ ఈమెయిల్స్ ద్వారా ఎలాంటి వేతన పెంపు ఉండదనే సమాచారాన్ని ఫ్లిప్కార్ట్ చేరవేసింది.
అయితే బోనస్లు, ఎంప్లాఈ స్టాక్ ఆప్షన్స్ యధావిధిగా అందచేయనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. ఫ్లిప్కార్ట్ ఇప్పటికే వార్షిక పెర్ఫామెన్స్ సమీక్షను పూర్తిచేయగా ఏప్రిల్ 1 నుంచి వేతన పెంపు వర్తించనుంది. పలు టెక్ కంపెనీలు లాభాల కోసం ఖర్చుల్లో కోత విధిస్తున్న నేపధ్యంలో ఫ్లిప్కార్ట్ వేతన పెంపుపై ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వనరులను సమర్ధంగా వినియోగించాలని కంపెనీ కోరుకుంటోందని ఫ్లిప్కార్ట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ దిశగా 70 శాతం ఉద్యోగులకు వేతన పెంపు వర్తింపచేస్తున్నామని తెలిపింది. ఆపై స్టాక్ ఆప్షన్ కేటాయింపు, బోనస్ కూడా అర్హులందరికీ కొనసాగుతుందని ఫ్లిప్కార్ట్ స్పష్టం చేసింది. పలు స్టార్టప్ కంపెనీలు నిధుల కొరతతో ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో ఉద్యోగులను కాపాడుకోవడం, ట్యాలెంట్ను ఆకర్షించే క్రమంలో ఫ్లిప్కార్ట్ స్టాక్ ఆప్షన్, బోనస్ల పంపిణీ, 70 శాతం మందికి వేతన పెంపు అందించే నిర్ణయాలను తీసుకుంది.
Read More :
Google | గూగుల్ కీలక నిర్ణయం.. డెస్క్ షేర్ చేసుకోవాలంటూ ఉద్యోగులకు ఆదేశం..!
NPS Benefits | పన్ను ఆదాతోపాటు హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ గడపాలంటే బెస్ట్ ఈ స్కీమ్