OPPO F25 Pro 5G : భారత్ మార్కెట్లో మధ్యశ్రేణి స్మార్ట్ఫోన్ల పోర్ట్పోలియోను విస్తరిస్తున్న ఒప్పో లేటెస్ట్గా ఒప్పో ఎఫ్25 ప్రొ 5జీ లాంఛ్ చేసింది. 4కే వీడియో రికార్డింగ్, వివిడ్ బోర్డర్లెస్ డిస్ప్లే, మెరుగైన ఫొటోగ్రఫీ కోసం స్మార్ట్ ఏఐ ఫీచర్స్ వంటి పలు అధునాతన ఫీచర్స్తో న్యూ స్మార్ట్ఫోన్ కస్టమర్ల ముందుకొచ్చింది.
పవర్ఫుల్ పెర్ఫామెన్స్తో స్లిమ్, లైట్వెయిట్, డ్యూరబుల్ స్మార్ట్ఫోన్గా ఈ డివైజ్ ఆకట్టుకుంటుందని కంపెనీ చెబుతోంది. ఇక ఒప్పో ఎఫ్25 ప్రొ 5జీ పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే, సూపర్ఫాస్ట్ 100డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగిఉంది.
ఇక ఒప్పో ఎఫ్25 ప్రొ 5జీ అండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14పై రన్ అవుతుంది. మెరుగైన సేఫ్టీ, ప్రైవసీ కోసం అప్గ్రేడెడ్ టెక్నాలజీ, యూజర్ ఫ్రెండ్లీ టూల్స్తో పాటు ఈ ఓఎస్ స్మార్ట్ ఏఐ ఫీచర్లను కలిగిఉంది. ఇక ఒప్పో ఎఫ్25ప్రొ 5జీ 128జీబీ రూ. 23,999, 256జీబీ రూ. 25,999కి అందుబాటులో ఉంటుంది. మార్చి 5 నుంచి స్టోర్స్లో లభించనున్న ఈ డివైజ్ ఒప్పో ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్పై అందుబాటులో ఉండనుంది.
Read More :