Oppo F23 Pro 5G | చైనా టెక్ కంపెనీ ఒప్పో.. భారత్ మార్కెట్లోకి ‘ఒప్పో ఎఫ్23 ప్రో 5జీ (Oppo F23 Pro 5G) తీసుకొచ్చింది. ఇది సింగిల్ వేరియంట్.. 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతో వచ్చింది. రామ్ మరో 8జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ధర రూ.24,999. అధికారిక వెబ్ సైట్ నుంచి ప్రీ-ఆర్డర్ కూడా బుక్ చేసుకోవచ్చు.
ఒప్పో ఎఫ్23 ప్రో 5జీ (Oppo F23 Pro 5G) ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తున్నది. ఈ ఫోన్ డిస్ ప్లే (2400×1080 పిక్సెల్స్) రిజొల్యూసన్ కలిగి ఉంటుంది. బ్రైట్ నెస్ 580 నిట్స్ ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో ఒప్పో ఎఫ్23 ప్రో 5జీ వస్తున్నది. ఆండ్రాయిడ్ 13.1 బేస్డ్ కలర్ ఓఎస్ మీద ఈ ఫోన్ పని చేస్తుంది.
ఫొటోగ్రఫీ కోసం ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ అండ్ 40x మైక్రో లెన్స్ కెమెరా ఉంటాయి. సెల్ఫీల కోసం 32-మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 67 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 44 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా చార్జింగ్ అవుతుంది. ఫోన్ చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ 5జీ, 4జీ, 3జీ, వై-ఫై, బ్లూ టూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ కనెక్టివిటీ ఉంటుంది.