న్యూఢిల్లీ, నవంబర్ 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ఓఎన్జీసీ రూ.5 వేల కోట్లు డివిడెండ రూపంలో చెల్లించింది. దీంతో మొత్తంగా ఈ ఏడాది రూ.23,797 కోట్లు కేంద్రానికి పీఎస్యూల నుంచి డివిడెండ్ అందింది. ప్రభుత్వానికి ఉన్న వాటా కింద రూ.5,001 కోట్లను అందచేసింది.
ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపం) కార్యదర్శి తుహిన్ కాంతా ట్విట్ చేశారు. అధిక డివిడెండ్లను చెల్లించాలని రెండేండ్ల క్రితం ప్రభుత్వరంగ సంస్థలకు దీపం కార్యదర్శి సూచించిన విషయం తెలిసిందే.