న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఓలా..కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఎస్1 స్కూటర్ల ధరలను రూ.25 వేలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. తగ్గించిన ధరలు ఈ నెల చివరివరకు అందుబాటులో ఉండనున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అలాగే ప్రస్తుతం స్కూటర్లపై ఇస్తున్న 40 వేల కిలోమీటర్లు లేదా 3 ఏండ్ల వ్యారెంటీని 80 వేల కిలోమీటర్లు లేదా 8 ఏండ్లకు పెంచుతున్నట్లు కంపెనీ ఫౌండర్, ఎండీ భావిష్ అగర్వాల్ తెలిపారు. ఇందుకోసం ఎలాంటి చెల్లింపులు జరుపాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు.