ముంబై, డిసెంబర్ 22: ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ రూ.5,500 కోట్ల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ఓలా ఎలక్ట్రిక్ సమర్పించింది. ఐపీవోలో రూ.10 ముఖవిలువగల 9.52 కోట్ల ఈక్విటీ షేర్లను జారీచేయాలని ప్రతిపాదించింది.
అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సాఫ్ట్బ్యాంక్ పెట్టుబడులు కలిగిన ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3 లక్షల ఈ-స్కూటర్లను విక్రయిస్తుందని, 5.9 కోట్ల డాలర్ల రెవిన్యూ వస్తుందని అంచనా.