Ola Scooters | న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఎంట్రీ లెవల్ స్కూటర్ ఎస్1 ఎక్స్ మాడల్ ధరను రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు తగ్గించింది ఓలా ఎలక్ట్రిక్. ఫిబ్రవరిలో ఎస్1 ఎక్స్ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ.. కేవలం రెండు నెలల్లోనే ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.
ఈ నూతన ధరలు వెంటనే అమలులోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో 4 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ ధర రూ.1,09, 999 నుంచి రూ.99,999కి దిగిరానుండగా, 3 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ ధర కూడా రూ.89,999 నుంచి రూ. 84,999కి, 2 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ రూ.79,999 నుంచి రూ.69, 999కి దిగిరానున్నాయి.