న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు ఈ-వెహికల్స్తో ముందుకొస్తున్నాయి. తాజాగా ఒకినవ ఆటోటెక్ భారత్లో రూ 1.22 లక్షలు పలికే ఒఖి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంఛ్ చేసింది.
కన్వెన్షల్ డిజైన్తో ఆధునిక టెక్నాలజీతో వెహికల్ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. బైక్ సైజ్ అలాయ్ వీల్స్, హెడ్ల్యాంప్ ఎల్ఈడీ యూనిట్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో ఈ వెహికల్ ఆకట్టుకుంటోంది. భారత రోడ్లకు అనుగుణంగా 16 ఇంచ్ అలాయ్ వీల్స్ వాడటంతో స్కూటర్కు యూనిక్ లుక్ వచ్చింది.
రెడ్, వైట్, బ్లూ, గ్రే కలర్స్లో ఒఖి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. కీలెస్ స్టార్ట్, యూఎస్బీ పోర్ట్, బూట్ లైట్, యాంటీ థెఫ్ట్ కీ వంటి పలు ఫీచర్లను జోడించారు.