న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ప్రముఖ ఈ-స్కూటర్ల సంస్థ ఒకాయా..కొనుగోలుదారులు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీకి చెందిన అన్ని రకాల స్కూటర్లపై రూ.18 వేల వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నదని కంపెనీ ఎండీ అన్షుల్ గుప్తా తెలిపారు. ధరలు అధిక స్థాయిలో ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొనుగోలుదారులకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.
సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో సింగిల్ చార్జింగ్తో 74 కిలోమీటర్లు ప్రయాణించే స్కూటర్ ధర రూ.74,899కి తగ్గగా, అలాగే 140 నుంచి 160 కిలోమీటర్లు ప్రయాణించే ఫాస్ట్ ఎఫ్4 మాడల్ రూ.1,19,990కి తగ్గనున్నది. ధరలు తగ్గించకముందు ఇది రూ.1,37,990గా ఉన్నది. ఎఫ్3 మాడల్ రూ.1,24,990 నుంచి రూ.1,09,990కి దిగిరానుండగా, మోటోఫాస్ట్ మాడల్ రూ.1,41,999 నుంచి రూ.1,28,999కి, ఫాస్ట్ ఎఫ్2ఎఫ్ మాడల్ రూ.93,999 నుంచి రూ.83,999కి, ఫాస్ట్ ఎఫ్2బీ మాడల్ రూ.1,02,950 నుంచి రూ.93,950కి దించింది.